- Praveen Kumar G
- Bible Study
- Sajeeva Vahini Vol 2 Issue 2
గ్రంథ కర్త: మలాకి 1:1 ప్రకారం మలాకీ ప్రవక్త అని వ్రాయబడియుంది.
రచించిన తేదీ: క్రీ.పూ. 440 మరియు 400||సం మధ్య రచించి ఉండవచ్చు.
అధ్యాయాలు : 4, వచనములు : 55
రచించిన ఉద్దేశం: దేవుడు
మూల వాక్యాలు: 1:6 “కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా” 3:6,7 “యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు. మీ పితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా-మేము దేనివిషయములో తిరుగుదుమని మీరందురు.”
ఉపోద్ఘాతం: పాపము ద్వారా దేవుని నుండి దూరమైన ప్రజలను ఉద్దేశిస్తూ రచించిన ఈ గ్రంథం, వారికే కాకుండా యాజకులు కూడా తమ యాజక ధర్మం నుండి దేవునికి దూరస్తులయ్యారు. దేవునికి అర్పించవలసిన వాటిలో సరియైన క్రమ పద్ధతులను పాటించుటలో విఫలమయ్యారు. అయోగ్యమైన వాటిని బలిగా అర్పించి దేవునికి మాహా కోపము పుట్టించారు. వాటిని అర్పించడమే కాకుండా యుదయా వారు దేవుడు
మలాకీ ప్రవచించినది బాప్తీస్మమిచ్చు యోహాను ప్రకటనను ఆధారం చేసుకొనునది. అనగా దేవుని నుండి పంపబడిన మనుష్యుడైన బాప్తీస్మమిచ్చు యోహాను (మత్తయి 11:10) మెస్సీయా కొరకు త్రోవను సరాళము చేసాడు అంతే కాకుండా మారుమనస్సు పొంది ఆయన నామంలో బాప్తీస్మము పొందుమని తెలియజేసాడు.
సారాంశం: అజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఆయనకు దూరస్తులైన వారు, క్షమాపణా జీవితం కలిగి యుంటే ఆయన దరికి చేర్చి, వారిని ఆయన క్షమించేవాడుగా ఉంటాడు. మలాకీ 2:16 ప్రకారం “పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ” అని వ్రాయబడిన రీతిగా వివాహబంధం విషయంలో దేవుని ఉద్దేశం ఎంత ఖచ్చితంగా ఉందో మనకు అర్ధమవుతుంది. భార్యా భర్తల మధ్య ఏర్పడు సన్నిహిత్యాన్ని జీవితకాలం కాపాడుకోవాలి. దేవుడు
0 comments