Thursday, June 3, 2021

దానియేలు ఆ ప్రతిమను పూజించలేదు. అయినా అగ్ని గుండములో వేయబడలేదు.

 

 


 
✳️  *దానియేలు భక్తుడు కాలములో రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ చేయించి, దాని పూజించని వారిని అగ్నిగుండములో వేసాడు. అగ్నిగుండములో మహాభక్తుడైన "దానియేలుని" వేయకుండా కేవలము "షద్రకు, మేషాకు , అబేద్నగో" అను ముగ్గురిని మాత్రమే వేసాడు. ఎందుకు దానియేల్ ను అగ్నిగుండములో వేయలేదు ?*

👉 దానియేలు  ఆ ప్రతిమను పూజించలేదు. అయినా అగ్ని గుండములో వేయబడలేదు.

*ఇలాంటిదే మరొక విచిత్ర సంఘటన ఇదే దానియేలు గ్రంధములో వ్రాయబడింది . రాజగు దర్యావేషు కాలములో రాజుకు తప్ప మరి ఎవరికైనా ప్రార్ధన చేస్తే సింహల గుహలో పడద్రోయమని శాసనము చేయబడింది . అప్పుడు దానియేలు మాత్రమే సింహల గుహలో పడద్రోయ బడ్డాడు కానీ షద్రకు, మేషాకు , అబేద్నగోలు సింహల గుహలో పడద్రోయబడలేదు.*

ప్రాణాలు తెగించిమరి అగ్నిగుండములోకి వెళ్లిన ఈ ముగ్గురూ దేవునికి ప్రార్ధన చేసి ఉండరా ?! తప్పకుండా ప్రార్ధన చేసే ఉంటారు కానీ సింహల గుహలో పడద్రోయబడలేదు.

👉 *అదే ఎందుకు  దానియేలు  ఎందుకు అగ్ని గుండములో వేయబడలేదు ?*

👉  *షద్రకు, మేషాకు , అబేద్నగోలు ఎందుకు సింహల గుహలో పడద్రోయబడలేదు?*

👉 *వాళ్ళు అందరూ ఒకే కాలములో బ్రతకలేదా ?*

♻️ *వాళ్ళందరూ స్నేహితులు , దాదాపు సమాన వయస్సు కలవారు. వాళ్ళ నలుగురు బ్రతికివుండగానే ఈ రెండు సంఘటనులు జరిగాయి.*

👉 కనీ ఈ బేధము వెనక దేవుడు  మనకు ఒక ముఖ్యమైన పాఠము నేర్పాలనుకున్నాడు .

🔺 *ఎప్పుడైనా సాతాను ఒక శోదనగాని,శ్రమగాని విశ్వాసులందరి మీదకి  తీసుకుని  వస్తాడో అప్పుడు అందరు  విశ్వాసులు ఒకేలా శ్రమపడరు,ఒకేలా శోధింపబడరు.*

👉  ఆ శ్రమ లేదా శోధన యొక్క ప్రభావము కొందరి మీద అధికముగా ఉంటుంది,కొందరి మీద తక్కువగా ఉంటుంది , కొందరి మీద అసలు ఉండనే ఉండదు.

👉 సతాను ఒక కుటుంబాన్ని శోధించాలి అనుకున్నాడు అనుకో ఆ శోధన కుటుంబములో అందరి వ్యక్తులకు ఒకేలా ఉండదు.

▪️ ఒకొక్కసారి ఆ శోధన భార్యకు ఎక్కువగా ఉంటుంది ,
▪️ మరొకసారి ఆ శోధన భర్తకు ఎక్కువగా ఉంటుంది ,

▪️ఇంకొకసారి ఆ శోధన పిల్లలకు ఎక్కువగా ఉంటుంది.

👉 *సాతాను హిట్ లిస్ట్ లో ఎవరువుంటారో, దేవుడు ఎవరిని అనుమతిస్తాడో వాళ్లే ఎక్కువగా శోదించబడతారు.*  

🔺 దనికి  చక్కటి ఉదాహరణ మన యేసయ్య లూకా 22:31లో చెప్పాడు . ఇక్కడ మన ప్రభువు   *"సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని"* అంటున్నాడు .

👉 ఇక్కడ యేసయ్య...  సాతాను *"మిమ్మును"* శోధిస్తాడు అని అందరి గురించి  చెబుతూ *సీమోనూ  పేతురు యొక్క విశ్వాసము మాత్రమే తప్పిపోకుండునట్లు వేడుకున్నాడంట .*

👉 *అంటే సాతాను... శిష్యులందరిని శోదించబోతున్నప్పటికీ, ఆ  శోధన యొక్క ప్రభావము మాత్రము పేతురు మీద ఎక్కువగా ఉండబోతుంది.*

👉 సతాను హిట్ లిస్ట్ లో ఈసారి పేతురు వున్నాడు, నన్నెరుగనని ముమ్మారు అబద్ధము చెబుతాడు అని ముందే తెలిసి యేసయ్య  ముందుగానే ప్రార్థన చేసాడు.

🔺 *అదేవిధముగా  బబులోను దేశములో 'అగ్నిగుండములో పడద్రోయబడుట' అనే శోధన అందరికి వచ్చినప్పటికీ సాతాను హిట్ లిస్ట్ లో మాత్రము షద్రకు, మేషాకు , అబేద్నగో  మాత్రమే వున్నారు.*

🔺 *కానీ దానియేలు ఆ హిట్ లిస్ట్ లో లేడు   .  అలాగే ' సింహల గుహలో పడద్రోయబడుట 'అనే శోధన అందరికి వచ్చినప్పటికీ సాతాను హిట్ లిస్ట్ లో మాత్రము దానియేలు మాత్రమే వున్నాడు కానీ షద్రకు, మేషాకు , అబేద్నగోలు లేరు . వాళ్ళను ఏదోరకంగా  దేవుడు ఆ శోధన నుండి తప్పించాడు.*

♻️ *దానియేలు గ్రంధము ద్వారా దేవుడు మనకు ఈ పాఠాలని నేర్పడము వెనకు దేవునికి  ఏమైనా ప్రత్యేక ఉద్దేశము వుందా ?*

అవును బ్రదర్, ఏ ఉద్దేశము లేకుండా అనంతజ్ఞాని అయిన మన దేవుడు ఏమిచేయడు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి ,

*ఏ మతగ్రంధానికి లేని ఆధిక్యతలు బైబిల్ గ్రంధానికి మాత్రమే  ఉన్నాయి*

👉 అందులో ఒకటి ..  
*బైబిల్ గ్రంధము మాత్రమే భవిష్యత్ గురించి చెబుతుంది. కొత్తనిబంధనలో ప్రకటన గ్రంధము యేసు రెండవ రాకడ గురించి , భవిష్యత్ సంఘటనలు గురించి చెప్పే గ్రంధము. పాతనిబంధనలో కూడా ఇలాంటి గ్రంధమే వుంది అది దానియేలు గ్రంధము, ఈ గ్రంధము కూడా భవిష్యత్ సంఘటనలు గురించి చెబుతుంది .*

👉 దనియేలు గ్రంధాన్ని  బైబిల్ పండితులు *"పాతనిబంధన ప్రకటన గ్రంధము"* అంటారు. ఎందుకంటే *ఈ రెండు గ్రంధాలు యేసు రెండవ రాకడ గురించి , అబద్ద క్రీస్తు గురించి , అప్పుడు వుండే పరిస్థితుల గురించి ముక్తకంఠముతో చెబుతాయి.*   

👉 అబద్ద క్రీస్తు కాలములో వాడు చేసిన ప్రతిమకు నమస్కరించకుండా , 666 ముద్ర వేయించుకొనకుండా  ఆ యేసుని  నమ్ముతున్నవారిని  నరికి చంపేయండి (ప్రకటన13:15) అని అబద్ద క్రీస్తు ఆజ్ఞాపిస్తాడు.

👉 *ఎలాగైతే నెబుకద్నెజరు చేసిన బంగారు ప్రతిమకు నమస్కరించకపోయినా దానియేలు ఆ అగ్నిగుండములోకి వెళ్లలేదో ,అలాగే  కొందరు అబద్ద క్రీస్తు చేసిన ప్రతిమను  నమస్కరించపోయినా , 666 ముద్ర వేసుకోకపోయినా బ్రతికే వుంటారు.*

👉 👉 చలామంది ఎవరైతే హతసాక్షులగా  ఉండటానికి దేవుని చేత నిర్ణయించబడ్డారో వాళ్ళు మాత్రమే చంపబడతారు . మిగిలిన వారు మాత్రమూ ఎదో ఒక విధముగా విచిత్రముగా దానియేలులా కాపాడబడతారు, పోషించబడతారు .

🔺 *ఈ పాఠాన్ని నేర్పడానికి దేవుడు ఆ నలుగురి జీవిత చరిత్ర వాడుకున్నాడు కాబట్టి మనము కూడా ఎన్ని శ్రమలు, కష్టాలు వచ్చినా దానియేలు,షద్రకు, మేషాకు , అబేద్నగోలు వలే  ప్రభుకొరకు బలముగా నిలబడదాము,యేసు తప్ప వేరొక రక్షణ మార్గములేదనిగళమెత్తి చాటుదాం .చెప్పడము మాత్రమే మన బాధ్యత .*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
 
ప్రభుసేవలో....✍

మీ సహోదరుడు
*పాస్టర్ పాల్ కిరణ్ ,*
తాడిపత్రి,
అనంతపురం జిల్లా. A.P


 

 

No comments:

Post a Comment